Wednesday, May 15, 2024
- Advertisement -

భారత్ మాతాకీ జై అనాల్సిందే

- Advertisement -

ప్రఖ్యాత యోగ గురువు రాందేవ్ బాబా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దేశంలో ప్రతి ఒక్కరూ భారత్ మాతాకీ జై అనాల్సిందేనని, అలా అనని వారి తల నరుకుతానని చండీఘడ్ లో ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన రాందేవ్ వ్యాఖ్యనించారు. తనకు చంపాలని ఉన్నా చట్టాన్ని దృష్టిలో ఉంచుకుని అలా చేయడం లేదని రాందేవ్ తెలిపారు.

భారత్ మాతాకీ జై అనడం మాతృభూమిపై ప్రేమ చూపిండమే తప్ప మరొకటి కాదని అన్నారు. రాందేవ్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా స్పందించింది. ప్రధాని నరేంద్ర మోదీ వెంటనే స్పందించి రాందేవ్ పై చర్య తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత సంజయ్ ఝా ట్టిట్ చేశారు.

భారత్ మాతాకీ జై అనడం ముస్లీం మతానికి విరుద్ధమని, అందుకే తాము హిందుస్తాన్ జిందాబాద్ అంటూ నినదిస్తున్నామని ఇస్లాం మత సంస్ధ దారుల్ ఉలూమ్ డియోబంద్ ఫత్వా విడుదల చేసింది. మరోవైపు మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ స్పందిస్తూ భారత్ మాతాకీ జై అనని వాళ్లు దేశాన్ని విడిపోవాలని వ్యాఖ్యనించారు. 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -