హిందూపురం ఎమ్మెల్యే గా బాలకృష్ణ పై అక్కడి ప్రజలు తీవ్రస్థాయిలో నిరసన వ్యక్తం చేశారు. ఎన్టీఅర్ వారసుడిగా ఎంతో పేరు తెచ్చుకోవాల్సిన బాలకృష్ణ పరిస్థితి దారుణంగా మారింది. సినిమాలను,రాజకీయాలను హ్యాండిల్ చేస్తున్న బాలయ్యకు నియోజకవర్గ ప్రజల నుంచి ఎవరు ఉహించని ఎదురు దెబ్బ తగిలిండి.
అక్కడ ప్రజలు బాలయ్య కనిపిస్తే.. మొన్నటికి మొన్న మా ఎమ్మెల్యే కనిపించటం లేదంటూ పోలీస్ స్టేషన్లలో మిస్సింగ్ కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. అయినా అతను హిందూపురం రాలేదు. ముందే కరువు జిల్లా అందులోనూ ఎండాకాలం,గుక్కెడు నీటికోసం గొంతెండిపోతుంటే కనీసం తమను పట్టించుకోవట్లేదంటూ రోడ్డెక్కారు మహిళలు. ఈ తరుణంలో దున్నపోతులపై ఎమ్మెల్యే బాలకృష్ణ పేరు రాసి ర్యాలీ నిర్వహించారు.
అయితే బాలయ్య పేరును దున్నపోతు మీద రాసి ఊరేగించటం ఆయన పరువుకు సంబంధించి భంగం కలగడమేనంటున్నారు రాజకీయ నాయకులు. రామారావు కొడుకుగా,చంద్రబాబు బామ్మర్థిగా ఓ వెలుగు వెలగాల్సిన బాలయ్య మరీ ఇంతటి దారుణమైన పరిస్థితిని కొనితెచ్చుకున్నాడంటూ ఆరోపిస్తున్నారు సొంత పార్టీ నేతలు.
Related