ఆంద్రప్రదేశ్ మంత్రి వర్గంలో ఘనాపాటి మంత్రులు ఉన్నారు. ఎప్పుడు ఏంమాట్లాడుతారో వారికే అర్థంకాదు. ఒక బాధ్యతాయుతమైన మంత్రి పదవిలో ఉండి నీచంగా చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.
తాజాగా ఎక్సైజ్ శాఖ మంత్రి జవహర్ చేసిన వ్యాఖ్యలై విమర్శలువెల్లువెత్తుతున్నాయి. అటు సోషియల్ మీడియాలోకూడా జోకులు పేలుతున్నాయి.
{loadmodule mod_custom,GA1}
గతంలో ఉపాధ్యాయుడిగా పిల్లలకు పాఠాలు చెప్పి ఆ తర్వాత రాజకీయాల్లోకి వచ్చి ఇప్పుడు చంద్రబాబు కేబినెట్లో ఎక్సైజ్ శాఖ మంత్రిగా ఉన్న జవహర్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. సోషల్ మీడియాలో నెటిజన్లు నిప్పులు చెరిగారు. సోమవారం ఒక టీవీ ఛానల్తో మాట్లాడిన మంత్రి జవహర్… బీరు హెల్దీ డ్రింక్ అని చెప్పారు. బీరును హెల్దీ డ్రింక్గా ప్రభుత్వం తరపున ప్రమోట్ చేస్తామని ప్రకటించారు. బీర్ను హెల్దీ డ్రింక్ అని చెప్పడానికి మించిన దౌర్భాగ్యం దేశంలో ఏమైనా ఉంటుందా ? మీరు రండి… బీరు హెల్దీ డ్రింక్ అని నిరూపిస్తా” అంటూ సవాల్ చేశారు.
అయితే ఆయన వ్యాఖ్యలపై వైసీపీ ఫైర్బ్రాండ్ రోజా ఘాటుగా విమర్శలు గుప్పించారు.నీరు-మీరు కార్యక్రమంలా ప్రభుత్వం నీరు-బారు కార్యక్రమం చేపట్టిందని ఎద్దేవా చేశారు.ఇక సోషియల్ మీడియాలోకూడా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.అందుకే హెల్త్ డ్రింక్ బీర్కు మంత్రి అంబాసిడర్గా ఉంటె బాగుంటుందని సోషియల్ మీడియాలో జోకులు పేలుతున్నాయి.
{loadmodule mod_custom,GA2}
{loadmodule mod_sp_social,Follow Us}
{youtube}ATewcgg0SMg{/youtube}