మిర్యాలగూడలో జరిగిన ప్రణయ్ పరువు హత్య రెండు తెలుగు రాష్ట్రాలలో పెను సంచలనం సృష్టించింది.మిర్యాలగూడకు చెందన ప్రణయ్ అమృత అనే అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడని ,అమృత తండ్రి మారుతీరావు హత్య చేయించిన సంగతి తెలిసిందే.ప్రణయ్ తక్కువ కులస్థుడు అనే కారణంతోనే మారుతీరావు ఈ హత్య చేయించాడు. ప్రణయ్ పరువు హత్యపై దళిత సంఘాలు విచారం వ్యక్తం చేశాయి.ఇలాంటి దాడులు నేటికి జరగడంపై ప్రజా ప్రతినిధులు అందోళన చెందారు.పరువు హత్య కాస్తా కుల రంగు పులుముకోవడంతో రాజకీయ పార్టీలు సైతం తమ సానుభుతిని తెలియజేశాయి.తెలంగాణ ప్రభుత్వం ఓ అడుగు ముందుకేసి ప్రణయ్ కుటుంబ సభ్యులకు ఆర్థిక సాయంతో పాటు అమృతకి గవర్నమెంట్ జాబ్ ఇస్తామని ప్రకటించింది.
అయితే తాజాగా ప్రణయ్ కులం పెద్ద చర్చ నడుస్తుంది.ప్రణయ్ ఎస్సీ కాదని ,క్రైస్తవుడని తెలంగాణ మాల యువసేన వెల్లడించింది. అతడి అంత్యక్రియలు క్రైస్తవ సంప్రదాయాల ప్రకారమే జరిగాయని స్పష్టం చేసింది. ఎస్సీలకు వర్తించే చట్టాలు ప్రణయ్కు వర్తింపచేయవద్దని నల్లగొండ కలెక్టర్ను కోరింది. క్రైస్తవమతం స్వీకరిస్తే బీసీ-సీ పరిగణనలోకి వస్తారు కాబట్టి ఎస్సీ, ఎస్టీ చట్టం కింద ఇచ్చే ఆర్థిక సహకారం పొందేందుకు వారి కుటుంబసభ్యులు అనర్హులని తెలిపింది.ఇప్పటికే ఎన్నో వివాదాలు సృష్టించిన ప్రణయ్ హత్య,ఇంకా ఎన్ని వివాదాలకు దారి తీస్తుందో చూడాలి.