- Advertisement -

వల్లభనేని వంశీకి రిలీఫ్

- Advertisement -

వల్లభనేని వంశీకి ఏపీ హైకోర్టులో ఊరట లభించింది. ఆయనపై నమోదైన కేసులో అరెస్ట్ చేయవద్దని పోలీసులను హైకోర్టు ఆదేశించింది. బెజవాడ మాచవరం పోలీస్ స్టేషన్‌లో వంశీపై హత్యాయత్నం కేసు నమోదు కావడంతో, ఈ వ్యవహారం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ కేసులో తనను అరెస్ట్ చేసే అవకాశముందని భావించిన వంశీ, ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ ఏపీ హైకోర్టును ఆశ్రయించారు.

పిటిషన్‌పై ప్రాథమికంగా విచారణ జరిపిన హైకోర్టు, తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు వంశీని అరెస్ట్ చేయవద్దని స్పష్టం చేసింది. దీంతో వంశీకి తాత్కాలిక ఉపశమనం లభించినట్లయింది. కేసు వివరాలు, ఆరోపణల స్వభావం, అందుబాటులో ఉన్న ఆధారాలను పరిశీలించిన అనంతరం పూర్తి స్థాయిలో వాదనలు వినేందుకు కోర్టు సిద్ధమైంది. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫు న్యాయవాదులు కూడా తమ వాదనలు వినిపించారు.

ఈ కేసులో తదుపరి విచారణ తేదీని హైకోర్టు నిర్ణయించనుంది. అప్పటివరకు వంశీపై ఎలాంటి బలవంతపు చర్యలు తీసుకోరాదని కోర్టు స్పష్టం చేయడంతో వంశీకి రిలీఫ్ దక్కింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -