మనకు తెలిసి.. దొంగలను పట్టుకోవాలంటే… పోలీసులు.. వారి నుంచి తప్పించుకునేందుకు దొంగలు వేసే స్కెచ్ లు అన్నీ ఇన్నీ కావు. ఇలాంటివి మనం సినిమాల్లో చాలా చూసేసాం. ఇప్పుడు చెప్పబోయేది నిజంగానే జరిగిన స్టోరీ. ఇదేదో రామ్ గోపాల్ వర్మ చెప్పినట్లు నిజంగా జరిగిన కల్పిత గాధ అయితే కాదు. ఇపుడు మనం చదువుతూ చూడబోయేది.. బిహార్లోని దర్భంగాలో జరిగింది.
కట్ చేస్తే… బీజేపీ నేత సంజయ్ కుమార్ మహతో మొబైల్ ఫోన్ను పోగొట్టుకున్నాడు. ఆయనగారి ఫిర్యాదు మేరకు దర్భంగా కేసు నమోదైంది. ఈ కేసును సీనియర్ పోలీస్ ఆఫీసర్, అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ అయిన మధుబాల దేవికి అప్పగించారు. సదరు ఫోన్ కాల్ రికార్డ్స్ను చూసిన మధుబాల పోయిన ఆ ఫోన్… పేరుమోసిన గ్యాంగ్స్టర్ హస్నైన్ వద్ద ఉందని తెలుసుకున్నారు. దానికి తోడు ఆ ఫోన్ ఇంకా ఆన్లోనే ఉందని గుర్తించారు.అతగాడిని అరెస్ట్ చేసేందుకు వెళితే ప్రతిసారి తప్పించుకునేవాడు. ఇక లాభం లేదనుకున్న మధుబాల దేవి…ఓ సెలబ్రెటీ గాళ్ ఫ్రెండ్ అవతారం ఎత్తారు. హస్నైన్ కు ఫోన్ చేసి ట్రాప్ చేశారు. మధుబాలను ఫొటో పంపాల్సిందిగా కోరాడు.
మధుబాల తన మొబైల్లోని ప్రొఫైల్ పిక్చర్ను మార్చి…. ఆ స్థానంలో సౌత్ పాపులర్ హీరోయిన్ నయనతార ఫొటోను పెట్టడం జరిగింది. ఆ ఫొటోనే గ్యాంగ్స్టర్కు పంపారు. ఆ ఫొటో చూసిన నిజంగానే నయనతార నా క్రేజ్ చూసి ఇలా ఫోన్ చేస్తుందేమో అనుకున్నాడు. ఎందుకంటే ఇలాంటి వారి పాయింట్ ఆఫ్ వ్యూలో ఎనీథింగ్ ఈజ్ పాజిబిల్ కదా. హస్నైన్కు పిచ్చెక్కిపోయింది.ఆమెను కలుద్దామంటూ ప్రపోజ్ చేశాడు. దర్భంగాలో కలుద్దామని ఓ స్పాట్ చెప్పాడు. అనుకున్నట్లుగానే బురఖా ధరించి మధుబాల అక్కడకు వెళ్ళింది. ఈ లోపు మఫ్టీలో ఉన్న ఇతర పోలీసుల సాయంతో ఆ గ్యాంగ్స్టర్ను పట్టుకున్నారు. మధుబాల ఎంతో రిస్క్ చేసి సరికొత్త ఎత్తులతో అతన్ని పట్టుకున్న వైనాన్ని అందరూ ప్రశంసిస్తున్నారు. అత్యున్నత అధికారులు మధుబాలకు రివార్డు ప్రకటించారు.