Saturday, April 20, 2024
- Advertisement -

కొత్త గా వణికిస్తున్న బర్డ్​ ఫ్లూ కేసులు.. జర జాగ్రత్త..!

- Advertisement -

రాజస్థాన్​లో వెలుగులోకి వచ్చిన బర్డ్​ ఫ్లూ కేసులు మధ్యప్రదేశ్​లోనూ నమోదయ్యాయి. ఇందోర్​లో మూడు రోజుల క్రితం చనిపోయిన కాకులకు ఈ వైరస్ ఉన్నట్లు తేలింది. గత నాలుగు రోజుల్లో ఈ ప్రాంతంలో 96 కాకులు మరణించాయి. దీంతో అప్రమత్తమైన అధికారులు.. ముందుజాగ్రత్త చర్యలు చేపట్టారు. ఐదు కిలోమీటర్ల పరిధిలో ఎవరూ తిరగకుండా.. కర్ఫ్యూ విధించారు. ఫ్లూ సోకినట్లు అనుమానం ఉన్న పక్షులను గుర్తించే పనిలో పడ్డారు.

మరోవైపు, మధ్యప్రదేశ్​లోని ఝాలావాడ్​లో గుర్తించిన ఏవియన్ ఇన్​ఫ్లుయెంజా.. ఆ జిల్లాలోని ఇతర ప్రాంతాలకు విస్తరిస్తోంది. పన్వార్, సునేల్ ప్రాంతాల్లోనూ కాకుల మరణాలు సంభవించాయి. శనివారం ఝాలావాడ్​లో 16 కాకులు మరణించగా.. పన్వార్​లో 10, సునేల్​లో 8 కాకులు మృతి చెందాయి. పన్వార్​లో నాలుగు రోజుల క్రితం 60 కాకులు కూడా చనిపోయినట్లు స్థానికులు చెబుతున్నారు. అధికారులు స్పందించి.. నమూనాలను పరీక్షలకు తరలిస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -