ఏపీకీ కేంద్రం చేసిన సహాయంపై మిత్రపక్షాలు భాజాపా-టీడీపీ మధ్య మాటల యుద్ధం నుంచి సవాళ్ల స్థాయికి చేరింది. రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం చేస్తున్న సాయంపై ప్రజల్లోకి వెళ్లి చెబుతామని, అభివృద్ధిపై చంద్రబాబుతో చర్చకు తాము సిద్ధమని బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు అన్నారు. ఏపీకి కేంద్రం చేస్తున్న సహయంపై టిడిపి నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని సోము వీర్రాజు అభిప్రాయపడ్డారు .ఈ విషయమై బహిరంగ చర్చకు తాను సిద్దంగా ఉన్నానని వీర్రాజు చెప్పారు.
విజయవాడలో జరిగిన బీజేపీ నేతల కీలక సమావేశంలో కేంద్రం ఏపీ అభివృద్ధికి చేసిన సహాయంపై చర్చిచారు. ఢిల్లీ లాంటి అభివృద్ధిని ఏపీకి అందించామని, రాష్ట్రం విడిపోతేనే అభివృద్ధి జరిగిందని అన్నారు. తాము అవినీతిపరులం కాదని, అభివృద్ధిని కోరుకునేవాళ్లమని, రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలా న్యాయం చేస్తోందని, ఏపీ అభివృద్ధిపై ఎవరూ బాధపడాల్సిన అవసరం లేదని అన్నారు.
ఏపీకి చేసిన న్యాయంపై బీజేపీ సమావేశంలో షార్ట్ ఫిల్మ్ ప్రదర్శించారు. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఏపీ పరిస్థితుల నుంచి ప్రస్తుత పరిస్థితుల వరకు ఈ షార్ట్ ఫిల్మ్ లో చూపించారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన నిధుల వివరాలతో పాటు, ఇంకా ఏపీకి ఏం చేయబోతున్నారనే విషయాలపై షార్ట్ ఫిల్మ్ ప్రదర్శించినట్టు సమాచారం.
రాష్ట్రానికి ఇచ్చిన మమీలను 90 శాతం అమలు చేసినట్టు వీర్రాజు చెప్పారు.విజయవాడ ఎంపీ కేశినేని నాని అడిగితే వేలాది కోట్ల రూపాయాల రోడ్లు ఇచ్చిన విషయం వాస్తవం కాదా అని వీర్రాజు పశ్నించారు. సోము వీర్రాజు చేసిన ప్రతిపాదనపై టీడీపీ నేతలు ఎలాస్పందిస్తారో చూడాలి.