మోదీ పర్యటన తర్వాత టీడీపీపై భాజాపా విమర్శలు మరింతగా ఎక్కుపెట్టింది. రాష్ట్రానికి రైల్వే జోన్ కేంద్రం ప్రకటించడంతో నేతల్లో జోష్ మరింత పెరిగింది. తాజాగా భాజాపా ఎంపీ జీవీఎల్ బాబుపై సెటైర్ల వర్షం కురిపించారు. పుల్వామాలో ఉగ్రదాడి తరువాత బాబు చేసిన వ్యాఖ్యలపైనా మండిపడ్డారు. బాబు చేసిన వ్యాఖ్యలతో దేశమంతా ఆయనకు చీవాట్లు పడ్డాయన్నారు. రైల్వే జోన్ అంశంలో మోదీకి పేరు వస్తుందనే అక్కసుతో చంద్రబాబు రాజకీయం చేస్తున్నారన్నారు. కేంద్రం అముల చేస్తున్న అనేక పథకాలకు బాబు స్టిక్కర్ వేసి తమవిగా ప్రచారం చేసుకుంటున్నారని మండిపడ్డారు. నిన్న మోదీనే స్వయంగా బాబు బండారాన్ని ప్రజలకు వివరించారన్నారు. ఒక్క దాడితో పెద్ద ఎత్తున ఉగ్రవాదుల్ని మట్టుపెట్టడం ప్రపంచ చరిత్రలో ఇదే తొలిసారన్నారు.
పాకిస్తాన్ తో యుద్ధం జరుగుతుందని ముందే తెలుసునని పవన్ చేసిన వ్యాఖ్యలపైనా జీవీఎల్ ఫైర్ అయ్యారు. పవన్ వ్యాఖ్యల వెనుక బాబు ఉన్నారని ఆరోపించారు. పవన్ ఈ మధ్య వింతగా మాట్లాడుతున్నారని ఎద్దేవ చేశారు. పాకిస్థాన్ను షార్ట్కట్లో పీకే అంటారని.. అందుకే పవన్ కళ్యాన్ పీకే నేమ్తో పెట్టిన కామెంట్స్ పాక్లో వైరల్ అయ్యాయని ఎద్దేవా చేశారు. ఓట్ల కోసం జాతీయ భద్రతకు సంబంధించిన అంశాల్ని వాడుకోవద్దని హితవు పలికారు. ఇప్పటికైనా భారత్-పాకిస్థాన్ యుద్ధానికి ఉద్దేశించి పవన్ చేసిన వ్యాఖ్యలు ఉపసంహరించుకున్నట్లు ప్రకటించాలని డిమాండ్ చేశారు.