- Advertisement -
అసోంలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఉత్తర గువాహటిలోని బ్రహ్మపుత్ర నదిలో ప్రయాణికులతో వెళ్తున్న ఓ పడవ బోల్తా పడిన దుర్ఘటనలో 45 మంది గల్లంతయ్యారు. ఇందులో ఇద్దరు చనిపోగా మరో 26 మంది ఆచూకీ చిక్కడం లేదు. పడవలో మొత్తం 50 మంది ఉన్నట్లు తెలుస్తోంది.
ఉత్తర గౌహతి దిశగా బోటు వెళ్తున్నన్న పడవ తీరం నుంచి సమారు 200 మీటర్లు దూరం వెల్లిన తర్వాత నీటిలో మునిగింది. విద్యార్థులతో వెళ్తున్న పడవ.. నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టు పిల్లర్లను ఢీకొట్టింది. పిల్లర్లను ఢీకొట్టిన తర్వాత ఇంజిన్ విఫలమైంది. ఆ వెంటనే బోటు రెండు ముక్కలైంది.
సమాచారమందుకున్న పోలీసులు, జాతీయ, రాష్ట్ర విపత్తు నిర్వహణ బృందం ఘటనాస్థలానికి చేరుకుని సహాయకచర్యలు చేపట్టింది. గజ ఈతగాళ్ల సాయంతో ప్రయాణికులను రక్షించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.