ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుపై వైకాపా నాయకులు మాటలతో దాడి చేస్తున్నారు. ఓటుకు నోటు కేసులో అడ్డంగా బుక్కైన చంద్రబాబు నాయుడు హైదరాబాదులోనే ఉంటే ఇంకేన్ని స్కాముల్లో.. అడ్డంగా దొరికిపోతారని.. అక్కడ నుంచి విజయవాడకు మకాం మార్చేశారంటూ వైకాపా నాయకులు బాబుని విమర్శిస్తున్నారు.
వైకాపా నాయకుడు అయిన బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ.. చంద్రబాబు నాయుడు పేరు ఓటుకు నోటు కేసులో 22 సార్లు ఏసీబీ సమర్పించిన నివేదికలో పేర్కొన్నారనీ, తాజాగా సమర్పించిన నివేదికలోనూ చంద్రబాబు నాయుడు పేరును పదేపదే జోడించారని వెల్లడించారు. తాను ఎలాంటి స్కాములు చేయలేదని చెప్పుకునే చంద్రబాబు నాయడు నిజంగా.. ఎలాంటి స్కాములు చేయకపోతే.. వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేసారు. చంద్రబాబు నాయుడు ఒకవేళ జైలుకు వెళితే ముఖ్యమంత్రి పీఠాన్ని ఎవరు అధిష్టించాలన్న దానిపై ఆ పార్టీలో చర్చ జరుగుతున్నట్లు సమాచారం వుందని బొత్స సత్యనారాయణ ప్రకటించారు.