Tuesday, May 14, 2024
- Advertisement -

బొత్స బాబాయ్.. జగన్ కు ఇన్ని రకాలుగా ఉపయోగపడుతున్నాడా!

- Advertisement -

ఆ మధ్య విదేశీ పర్యటన చేయాల్సి వస్తే అప్పుడు పార్టీ బాధ్యతల్లో కొన్నింటిని సత్తిబాబుకు అప్పగించి వెళ్లాడట జగన్ మోహన్ రెడ్డి.

సత్తిబాబు సమర్థత మీద నమ్మకం కలిగిన జగన్ తను బయటకు వెళ్లినప్పుడు చంద్రబాబుపై విరుచుకుపడే బాధ్యతను ఆయనకు అప్పగించాడట.

ఇక రెగ్యులర్ గా కూడా సత్తిబాబు అధికార పక్షంపై విరుచుకుపడుతూనే ఉన్నాడు. జగన్ పార్టీ తరపున ఈ విధంగా పనిచేస్తున్నాడు. కాంగ్రెస్ ను వీడి వచ్చి ఇలా యాక్టివ్ అయ్యాడు.

ఇక ఆర్థికపరంగా కూడా పుష్కలమైన వనరులను కలిగిన బొత్స జగన్ కు ఆ విషయంలో కూడా సహాయంగానే ఉన్నాడట. జగన్ ఢిల్లీలో చేపట్టబోయే ధర్నాకు సంబంధించిన ఖర్చులను సత్తిబాబే పెట్టుకోనున్నట్టుగా తెలుస్తోంది. అలాగే విశాఖ మున్సిపల్ ఎన్నికల విషయంలో కూడా మొత్తం ఖర్చును సత్తిబాబే పెట్టుకొంటున్నాడట. మరి ఈ విధంగా ఆర్థికంగా సత్తిబాబు జగన్ కు దన్నుగా నిలుస్తున్నట్టు తెలుస్తోంది.

అలాగే సత్తిబాబు కొంతమందికాంగ్రెస్ నేతలను వైకాపాలోకి తీసుకొచ్చే పనిలో కూడా ఉన్నాడట. ఆనం బ్రదర్స్ ను కాంగ్రెస్ ను వైఎస్సార్ కాంగ్రెస్ లోకి తీసుకొచ్చే పనిలో కూడా సత్తిబాబు మధ్యవర్తిత్వం వహిస్తున్నట్టుగా తెలుస్తోంది. మొత్తానికి సత్తిబాబు జగన్ కు బాగానే ఉపయోగపడుతున్నట్టుగా ఉన్నాడు. అలాగే జగన్ పార్టీ కూడా సత్తిబాబుకు బాగానే ఉపయోగపడే అవకాశాలే ఉంటాయని చెప్పాలి. 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -