- Advertisement -
ఎంకి పెళ్ళి సుబ్బి చావుకొచ్చినట్లు, గోదావరి పుష్కరాల తొక్కిసలాట ఘటన అటు ఇటు పోయి చివరకు దర్శకుడు బోయపాటి శ్రీను మీదకు చుట్టుకునేలా ఉంది. ప్రతిపక్ష పార్టీలు రాజమండ్రి దుర్ఘటన పై విమర్శల దాడి కొనసాగిస్తున్నాయి.
వైయస్ఆర్సిపి నాయకులు పుష్కరాలపై చంద్రబాబు డాక్యుమెంటరీ చిత్రీకరించారని అందుకే ఈ దుర్ఘటన జరిగింది అని వాపోతున్నారు.
తాజాగా వైయస్ఆర్సిపి సీనియర్ నేత బొత్స సత్యానారాయణ సమర్థిస్తూ బోయపాటి శ్రీను సినిమా వల్లే అంతటి ఘోరం జరిగిందని, దీనిపై విచారణ జరిపి బాధ్త్యులపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు.