ప్రఖ్యాత ఐటి సంస్ధ యాపిల్ సంస్ధ సిఇవో టిమ్ కుక్ హైదరాబాద్ లోని నానక్ రాం గూడాలో వేవే రాక్ బిల్డింగ్ లో తమ కార్యాలయాన్ని ప్రారంభించారు. ముంబాయ్ నుంచి ప్రత్యేక విమానంలో హైదరాబాద్ చేరుకున్న కుక్ కు శంషాబాద్ ఎయిర్ పోర్టులో ఘన స్వాగతం లభించింది. అక్కడి నుంచి ఆయన నేరుగా నానక్ రాం గూడా చేరుకుని కార్యాలయాన్ని ప్రారంభించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ తమ ఉత్పుత్తులైన ఐ ఫోన్, ఐ ప్యాడ్, మ్యాక్, వాచ్ లపై తయారీపై దృష్టి పెడతామని చెప్పారు. ఇవి ప్రారంభమైతే నాలుగు నుంచి ఐదు వేల మందికి ఉపాధి దొరుకుతుందని ఆయన అన్నారు. తమ ఉత్పత్తులను హైదరాబాద్ తయారు చేయడం తనకు చాలా ఆనందంగా ఉందన్నారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు మాట్లాడుతూ తమ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రోయాక్టివ్ విధానం వల్లే అనేక కంపెనీలు ఇక్కడికి వచ్చేందుకు ముందుకు వస్తున్నాయన్నారు. మరో వైపు గురువారం నాడు శుభవార్త చెప్తానన్న తెలంగాణ శాఖ మంత్రి కె.తారక రామారావు చెప్పే వార్త ఇదే కావచ్చునని ఐటి నిపుణులు అంటున్నారు. నిజమే కదా.. ఐదు వేల మందికి ఉపాధి కల్పించే అవకాశం రావడమంటే అది శుభవార్తే కదా.