నల్గొండ జిల్లా నకిరేకల్ లో నిన్న రాత్రి బీటెక్ విద్యార్ధిని రొట్టెల స్వాతి ఇంట్లో నే ఫ్యాన్ కి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది.
రొట్టెల సైదులు మంగమ్మ కి పెద్ద కూతురు గా చెబుతున్న స్వాతి వయసు ఇరవై సంవత్సరాలు. హైదరాబాద్ హయత్ నగర్ బ్రిలియంట్ ఇంజినీరింగ్ కాలేజీ లో బీటెక్ మూడవ సంవత్సరం చదువుతున్న స్వాతి పరీక్ష లో దీటేయిన్ అయ్యింది. మొన్ననే హైదరాబాద్ నుంచి తన ఇంటికి వచ్చేసి తల్లితండ్రుల దగ్గర ఉంది.
సర్టిఫికేట్ ల కోసం వచ్చాను అని చెప్పిన ఆమె తల్లితండ్రులతో అవి తీసుకుని వెళ్తాను అని చెప్పు రాత్రి పూట ఫ్యాన్ కి ఉరి వేసుకుని శవమై కనిపించింది.
తాను చనిపోవడానికి కారణంగా ఐదు పేజీల సూసైడ్ నోట్ ని స్వాతి రాసుకుంది. ” పరీక్షల్లో డీటెయిన్ అయ్యను, మీ పేరు నిలబెట్టలేక పోయాను. మీ ఆసలు నావల్ల నెరవేర లేదు నన్ను క్షమించండి, తమ్ముళ్ళని బాగా చదివించండి ” అంటూ ఆమె ఆ సూసైడ్ నోట్ లో రాసుకుంది