Thursday, May 9, 2024
- Advertisement -

నేహల్​ మోదీపై కేసు..న్యూయార్క్​ సుప్రీంకోర్టులో విచారణ..!

- Advertisement -

ప్రముఖ వజ్రాల వ్యాపారి నీరవ్​ మోదీ సోదరుడు నేహల్​ మోదీపై న్యూయార్క్​ సుప్రీంకోర్టులో కేసు నమోదైంది. ప్రపంచంలోనే అతిపెద్ద వజ్రాల వ్యాపార సంస్థల్లో ఒకటైన మన్​హాటన్​లోని ఎల్​ఎల్​డీ డైమండ్స్​ను నేహల్​ 2.6 మిలియన్​ డాలర్ల మేర మోసం చేసినట్లు అభియోగపత్రం దాఖలైంది.

2015 ఏప్రిల్​- ఆగస్టు మధ్యకాలంలో తమ సంస్థ నుంచి 2.6మిలియన్​ డాలర్లు విలువ చేసే వజ్రాలను వ్యాపారం పేరుతో నమ్మించి తీసుకుని మోసం చేశారని నేహల్​పై ఆరోపణలు చేసింది ఎల్​ఎల్​డీ. కాస్ట్​కో హోల్​సేల్ కార్పొరేషన్​తో సంబంధాలున్నట్లు చెప్పి తమ సంస్థ నుంచి క్రెడిట్​ బేస్​ మీద వజ్రాలు తీసుకున్నారని, ఆ తర్వాత వాటిని వేరే దగ్గర తాకట్టు పెట్టి వ్యక్తిగత ప్రయోజనాల కోసం రుణం తీసుకున్నారని కోర్టుకు తెలిపింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -