సీఎం చంద్రబాబు నాయుడు తనయుడు లోకేశ్ డ్రైవర్ కొండల్ రెడ్డికి ఏసీబీ నోటీసులు జారీ చేసింది. ఓటుకు నోటు కేసులో విచారణకు హాజరు కావాలని ఆదేశించారు. 160 సీఆర్పీపీసీ కింద ఏసీబీ నోటీసులు జారీ చేసింది.
ఓటుకు నోటు కేసు సమయంలో రేవంత్ గన్మెన్లతో కొండల్రెడ్డి తరచూ మాట్లాడారని ఏసీబీ అధికారులు చెప్పారు.. కొండల్రెడ్డి కోసం నిన్న టీడీపీ ఆఫీసుకు ఏసీబీ అధికారులు వెళ్లారు. ఆఫీసులో కొండల్రెడ్డి లేకపోవడంతో అధికారులు వెనుదిరిగారు.
రేపు కొండల్ రెడ్డిని విచారించిన తర్వాత నారా లోకేశ్కు కూడా ఏసిబి నోటీసులు అందజేసే అవకాశమున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ కేసులో చాలా మందిని విచారించిన ఏసిబి అధికారులు పలు కీలక సమాచారం రాబట్టినట్లు తెలుస్తోంది.
ఓటుకు నోటు వ్యవహారం కేసు రేవంత్ రెడ్డి బెయిల్ మీద బయటికి వచ్చినప్పటి నుంచి సమసిపోయిన విషయం తెలిసిందే.. అయితే ఏసిబి మాత్రం తన పని తాను చేసుకుపోతోంది. అందులో భాగంగానే ఈ రోజు లోకేశ్ డ్రైవర్ కొండల్ రెడ్డికి ఏసిబి నోటీసులు అందించింది. ఇప్పుడు మళ్ళీ ఈ కేసును ఏసిబి ముమ్మరం చేసింది. ఇప్పుడు ఎంతవరకు వెళ్తుందో చూడాలి.