ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కామెడీ చేయడంలో పండి పోయారు. ఆలోచించి మాట్లాడతారో, ఆలోచన లేకుండా మాట్లాడతారో లేకుంటే వినేవాల్లు వెర్రివాల్లు అనుకుంటారేమోగాని ఇష్టమొచ్చినట్లు బహిరంగ సభల్లో మాట్లాడుతుంటారు. బాబు కామెడీ రాష్ట్రాన్ని దాటి ముంబాయ్కి పాకింది. గతంలో ఏపీలో ఒలంపిక్ గేమ్స్ నిర్వహిస్తామని ప్రకటించి నవ్వుల పాలయ్యారు. సోషియల్ మీడియాలో బాబు పై పేలిన సెటైర్స్ తెలిసిందే. తాజాగా అదే కామెడీనీ ముంబయ్ లో చేశారు.
ఏపీలో అయితే బాబు ఏంమాట్లాడినా అస్థానమీడియా కవర్ చేస్తుండటంతో ఆయన ఏం మాట్లాడినా చెల్లుబాటు అయ్యేవి.అయితే చంద్ర బాబు ఇవే మాటలు ముంబైలో మాట్లాడే సరికే జాతీయ మీడియా లో హైలైట్ అయ్యింది. అక్కడ బాబు వ్యాఖ్యలను కవర్ చేసేందుకు ఆస్థాన మీడియా లేకపోవడంతో అది కాస్తా జాతీయంగా వైరల్ అయ్యింది.
అమరావతిలో ఒలింపిక్స్ నిర్వహిస్తామని గతంలో అనేక సార్లు బాబు ప్రకటించారు. ఇదే విషయాన్ని ముంబయ్లో కూడా ప్రకటించారు. ఇలా మాట్లాడుతున్న చంద్రబాబు నాయుడును ఏమనాలి? ఒలింపిక్స్ నిర్వహించడం అంటే.. అరువు ఆటగాళ్లను పిల్చుకుని వచ్చి హైదరాబాద్ లో జాతీయ క్రీడలు పెట్టినట్టుగా అని చంద్రబాబు నాయుడు అనుకొంటూ ఉండవచ్చు.
ఒలంపిక్స్ నిర్వహించాలంటే తగినన్ని క్రీడా ప్రాంగనాలు కావాలు. వాటి నిర్వహన ఖర్చు వందలకోట్లలో ఉంటుంది.టి పూర్వాపరాలు, ఒలింపిక్స్ ను ఇంతవరకు ఏయే దేశాలు నిర్వహించాయి. ఎంత ఖర్చు అయ్యిందనేది తెలుసుకోవాలి. భవిష్యత్తులో ఏయే దేశాలు ఒలింపిక్స్ నిర్వహణకు సిద్ధంగా ఉన్నాయి.. వంటి అంశాల గురించి ప్రాథమిక అవగాహన ఏమైనా ఉంటే చంద్రబాబు ఇలా మాట్లాడడు.