Sunday, May 12, 2024
- Advertisement -

మోడీ చేసిన పనికి డీలా పడిపోయిన చంద్రబాబు

- Advertisement -

ఏపీ రాష్ట్రాన్ని నెంబర్ 1 గా నిలబెడతాను అని చంద్రబాబు ఎప్పుడూ చెబుతూ ఉంటారు.సమైఖ్య  ఆంధ్ర ప్రదేశ్ లోని హైదరాబాద్ అంతగా అభివృద్ధి చెందడానికి తానే కారణం అని చెప్పే చంద్రబాబు ఏపీ ని ఎప్పటికైనా నెంబర్ వన్ స్థానం లో నిలబెట్టగలిగేది తాను మాత్రమే అని అంటూ ఉంటారు. ఆ వంకతోనే అమరావతి కోసం ఎదో ఒక దేశం వరకూ వెళ్లి ఇన్వెస్ట్మెంట్ లు పట్టుకోస్తున్నాం అంటూ చాల దేశాలు చుట్టి వచ్చారు ఆయన.

ఇప్పుడు ముఖ్యమంత్రులు ,వారి పనితీరు మీద రాబోతున్న ర్యాంకింగ్స్ మీద బాబు గారికి బెంగ పట్టుకుంది అని తెలుస్తోంది. మోడీ స్వయంగా ఇచ్చిన ఈ ర్యాంక్ లలో చంద్రబాబు ఐదవ స్థానం లో ఉన్నారట. త్వరలో అధికారికంగా ప్రకటించాల్సిన ఈ ర్యాంకింగ్స్ లో తన స్థానం చూసి షాక్ తిని డీలా పడ్డారట చంద్రబాబు. ఈ నెల 16 న ఒక సమావేశంలో మోడీ ఈ ర్యాంకులు ప్రకటిస్తారట.

నిజానికి ఈ సమావేశం ఈ రోజే జరగాల్సి ఉన్నా కొందరు సీఎంలు విదేశాల్లో ఉన్నందున 16కి వాయిదా వేశారు.  ఈ నేపథ్యంలో 16న ఉత్తమ ముఖ్యమంత్రుల జాబితాను మోడీ వెల్లడిస్తారు.  అయితే.. మంచి పాలకుడిగా పేరున్న తనకు అయిదో ర్యాంకు వస్తే తన పరువు పోతుందని చంద్రబాబు బాగా ఫీలవుతున్నారట. అంతేకాదు.. తాను ఎంతో కష్టపడి పనిచేస్తున్నా – కేంద్రం ఐదో రాంక్ ఇస్తోందని ఇది బాధాకరమని బాబు వ్యాఖ్యానించినట్లు సమాచారం.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -