- Advertisement -
ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతి నుంచి టోక్యోకు నేరుగా విమాన సర్వీసులను త్వరలో ప్రారంభిస్తామని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెల్లడించారు.
మంగళవారం నాడు ఆయన జపాన్ పారిశ్రామికవేత్తలతో సమావేశమయ్యారు. ఇక ముందు ఎపి నుంచి చాలా దేశాలకు నేరుగా విమానాలు నడిపే అవకాశాలను పరిశీలిస్తున్నామన్నారు. ఎపి నుంచే చైనా, జపాన్ లకు బౌద్ధం వ్యాప్తి చెందిందని, ఈ రెండు దేశాలకు ఆంధ్రప్రదేశ్ తో మంచి సంబంధాలున్నాయని అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పెట్టుబడులకు స్వర్గధామం అని ఎపి సిఎం అన్నారు.
