Sunday, April 28, 2024
- Advertisement -

జగన్ తొలి ఆరోపణ విలువ మూడొందల కోట్లు!

- Advertisement -

తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాకా ప్రతిపక్ష నేతగా వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు కుదురుకొన్నాకా .. ఆయన ఒక సంచలన ఆరోపణ చేశాడు.

ఇంత వరకూ తెలుగుదేశం పార్టీపై ధ్వజమెత్తడంలో డబ్బుల, లంచాల, కుంభకోణాల ప్రస్తావన తీసుకురాని జగన్ మోహన్ రెడ్డి తొలిసారి ఒక నంబర్ ను చెప్పాడు. ఏకంగా మూడువందల కోట్ల రూపాయల డబ్బు బాబుకు ముట్టిందని జగన్ ఆరోపించాడు.

పట్టిసీమ ప్రాజెక్టకు సంబంధించి జగన్ మోహన్ రెడ్డి తెలుగుదేశం ప్రభుత్వంపై ధ్వజమెత్తాడు. పోలవరం, పులిచింతల వంటి ప్రాజెక్టులపై దృష్టి సారించకుండా తెలుగుదేశం అధ్యక్షుడు, ఏపీ ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు పట్టిసీమ పేరుతో కాంట్రాక్టర్లకు దోచి పెడుతున్నాడని జగన్ మోహన్ రెడ్డి అంటున్నాడు. ఇలా ఎక్సెస్ ఫిగర్ తో పట్టిసీమ ప్రాజెక్టును చేపట్టడం ద్వారా చంద్రబాబుకు మూడువందల కోట్ల రూపాయల లంచం అందుతోందని జగన్ వ్యాఖ్యానించాడు.
ఈ విధంగా తెలుగుదేశం ప్రభుత్వంపై తొలిసారి జగన్ మోహన్ రెడ్డి గట్టిగా అవినీతి ఆరోపణను చేశాడు. ఇప్పటికే కాంగ్రెస్ వాళ్లు పట్టిసీమ ప్రాజెక్టు తో చంద్రబాబు తనయుడికి వందల కోట్ల రూపాయలు లంచం అందిందని ఆరోపించగా..ఇప్పుడు జగన్ మోహన్ రెడ్డి ఆరోపణలతో కొత్త అనుమానాలు రేగుతున్నాయి.
మరి ఇన్ని రోజులూ తెలుగుదేశం పార్టీ జగన్ పై లక్ష కోట్లు అంటూ విరుచుకుపడేది.. ఇకనుంచి వైకాపాపై అవినీతి ఆరోపణల అస్త్రాలను ప్రయోగిస్తుంది కాబోలు!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -