Sunday, May 5, 2024
- Advertisement -

మూడు ముళ్లు.. ఆరు పెళ్లిళ్ళ కిలాడి లేడీ

- Advertisement -

కులం.. మతం ఏదైనా మన దేశంలో వివాహ బంధానికి ఒక పవిత్ర త ఉంది. వేద మంత్రాల సాక్షిగా వధూవరులు ఒక్కటై కష్టం..సుఖంలో జీవి తాంతం తోడునీడగా ఉంటానని ప్రమా ణం చేసి వివాహం చేస్తుంటారు. ఒక‌రి కంటే ఎక్కువ అమ్మాయిల‌ను పెళ్లి చేసుకొని మోసం చేసిన వాల్ల‌ని చూశాం. కానీ ఇక్క‌డ మాత్రం అలా కాదు. ఇక్కడ ఈ అమ్మాయి.. ఒకరికి తెలియకుండా మరొకరిని.. ఇప్పటి వరకు మూడు ముళ్లు.. ఆరు పెళ్లిళ్లు చేసుకున్న కిలాడీ లేడీ ఆట‌క‌ట్టించారు పోలీసులు.

వివ‌రాల్లోకి వెల్తే…ప్రకాశం జిల్లా మోదినీపురం గ్రామానికి చెందిన అనంతరెడ్డి కుమార్తె మౌనిక ను ఖాజీపేట మండలం కొమ్మలూరు గ్రామానికి చెందిన భూమిరెడ్డి రామకృష్ణారెడ్డి అనే వ్యక్తికి ఇచ్చి 3 నెలల క్రితం వివాహం చేశారు. అమ్మాయి బాగుండడంతో ఎలాంటి కట్నం ఇవ్వక పోయినా ఎదురు కట్నం ఇచ్చి మరీ వివాహం చేసుకున్నారు.

వివాహం జరిగినప్పటి నుంచి ఇద్దరూ సఖ్యతగా ఉంటూ వచ్చారు. ఈ ఏడాది ఆగస్టు 25న ఆమె తండ్రి అనంతరెడ్డి కుమార్తె వద్దకు వచ్చి తమ కూతురిని పుట్టింటికి తీసుకు పోతున్నట్లు చెప్పి ఆమెను వెంట తీసుకుని బయలు దేరాడు. ఆ తర్వాత వారు పుట్టింటికి వెళ్లలేదు. తిరిగి అత్తగారింటికి రాలేదు. దీంతో కంగారు పడిన మౌనిక భర్త రామకృష్ణారెడ్డి అన్ని చోట్ల విచారించి చివరకు ఫలితం లేకపోవడంతో ఈనెల 9వ తేదీ ఖాజీపేట పోలీసులకు ఫిర్యాదు చేశారు.

భర్త ఫిర్యాదుతో విచారణ చేపట్టిన పోలీసులకు దిమ్మతిరిగిపోయే నిజాలు తెలిశాయి. ఇక్కడ ఇతినిని వదిలేసి.. హైదరాబాద్ లో మరో యువకుడిని పెళ్లాడింది. ఇలా చేయడం మౌనికకి కొత్త కాదని పోలీసుల దర్యాప్తులో తేలింది. ఇప్పటి వరకు ఆరుగురిని వివాహం చేసుకొని మోసం చేసింద‌ని పోలీసులు తెలిపారు. బంగారం కోస‌మే చాలా పెళ్లిల్లు చేసుకొంది. ఆమెకు తండ్రి కూడా స‌హ‌క‌రిస్తున్న‌ట్లు తెలుస్తోంది. మౌనికను పోలీసులు పూర్తి స్థాయిలో విచారించి ఆమెపై 420 కేసును నమోదు చేసినట్లు తెలుస్తోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -