Friday, May 3, 2024
- Advertisement -

రెచ్చిపోయిన మావోయిస్టులు…న‌లుగురు జ‌వాన్లు మృతి

- Advertisement -

ఛ‌త్తీస్‌గ‌ఢ్‌లో మావోయిస్టులు రెచ్చిపోయారు. మందుపాతర పేల్చిన ఘటనలో సీఆర్‌పీఎఫ్‌కు చెందిన నలుగురు జవాన్లు మృతి చెందారు. మరో ఇద్దరు జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు. వారిలో ఒక‌రి ప‌రిస్థితి విష‌మంగా ఉన్న‌ట్లు స‌మాచారం. శనివారం (అక్టోబర్ 27) మధ్యాహ్నం బీజాపూర్‌లోని అవపల్లి పోలీస్ స్టేషన్ సమీపంలో జవాన్లు ప్రయాణిస్తున్న వాహనాన్ని మావోయిస్టులు శక్తివంతమైన మందుపాతరతో పేల్చివేశారు. దీంతో నలుగురు జవాన్లు అక్కడికక్కడే మరణించారు.

యాంటీ-ల్యాండ్‌మైన్ వాహనం అయినప్పటికీ పేలుడు ధాటికి అది తీవ్రంగా ధ్వంసమైనట్లు తెలుస్తోంది. పేలుడు ధాటికి జవాన్ల వాహనం గాల్లోకి ఎగిరి అల్లంత దూరాన ఎగిరి పడినట్లు సమాచారం. అక్క‌డికి మ‌రిన్ని బ‌ల‌గాల‌ను పంపింది ప్ర‌భుత్వం. న‌వంబ‌రులో ఛ‌త్తీస్‌గ‌ఢ్ అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. రెండు విడ‌త‌ల్లో పోలింగ్ నిర్వ‌హిస్తారు. న‌క్స‌ల్ ప్ర‌భావిత ప్రాంతాల్లో న‌వంబ‌రు 12న పోలింగ్ జ‌ర‌గ‌నుంది. మిగిలిన ప్రాంతాల్లో నవంబ‌రు 20న ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. తెలంగాణ‌, మ‌ధ్య‌ప్ర‌దేశ్‌, రాజ‌స్థాన్‌, రాజ‌స్థాన్‌తో పాటు డిసెంబ‌రు 11న ఫ‌లితాలు వెల్ల‌డిస్తారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -