Wednesday, May 8, 2024
- Advertisement -

మన ప్రధాని పై చైనా నిఘా.. విచారణకు సుప్రీం సిద్ధం..!

- Advertisement -

భారత రాష్ట్రపతి, ప్రధానమంత్రి, న్యాయమూర్తులు సహా ప్రముఖులపై చైనా నిఘా వేసి ఉంచుతోందన్న ఆరోపణలపై దర్యాప్తు చేసేలా కేంద్రాన్ని ఆదేశించాలని దాఖలైన పిటిషన్​ విచారణ తేదీని సుప్రీంకోర్టు నిర్ణయించింది. వచ్చే ఏడాది జనవరిలో దీనిపై వాదనలు విననున్నట్లు తెలిపింది. ‘క్రిస్మస్, కొత్త సంవత్సర సెలవుల తర్వాత ఈ కేసును తమ దృష్టికి తీసుకురావాల’ని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్​ ఎస్​ఏ బోబ్డే నేతృత్వంలోని ధర్మాసనం సూచించింది.

సేవ్ ​దెమ్ ఇండియా ఫౌండేషన్’ అనే ఎన్​జీఓ ఈ అంశంపై ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని దాఖలు చేసింది. సైబర్ ఉగ్రవాదం, సైబర్ క్రైమ్, ఐటీ చట్టం, ఐపీసీ ప్రకారం దీనిపై చర్యలు తీసుకునేలా ఆదేశాలు జారీ చేయాలని ధర్మాసనాన్ని అభ్యర్థించింది. దీంతోపాటు చైనా కేంద్రంగా పనిచేసే డిజిటల్ లోన్ యాప్​లను భారత్​లో నిషేధించాలని కోరింది. విరుద్ధ పద్ధతులు పాటిస్తున్న ఎన్​బీఎఫ్​సీలు, లోన్ యాప్​లపై చర్యలు తీసుకోవాలని పేర్కొంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -