దేశంలో కరోనా పాజిటీవ్ ఎంతగా టెన్షన్ సృష్టిస్తుందో అందరికీ తెలిసిందే. సామాన్యుల నుంచి సెలబ్రెటీల వరకు ఎవ్వరినీ వదలడం లేదు. ఇప్పటికే పలువురు సినీ, రాజకీయ సెలబ్రెటీలకు కరోనా పాజిటీవ్ రావడం కొంత మంది చనిపోవడం కూడా జరిగింది. ఈ మద్య నటుడు రాజశేఖర్ ఫ్యామిలీకి కరోనా పాజిటీవ్ రావడం తగ్గడం కూాడా జరిగింది.
తాజాగా మెగాస్టార్ చిరంజీవికి కోవిడ్ పాజిటివ్ వచ్చింది. ఈ విషయాన్ని చిరంజీవి తన ట్విట్టర్ లో చెప్పారు. ఆచార్య షూటింగ్ ప్రారంభించేందుకు కోవిడ్ టెస్టు చేయించుకోగా పాజిటివ్ వచ్చిందన్నారు. తనకు ఎలాంటి కోవిడ్ లక్షణాలు లేవు కానీ.. వెంటనే హోం క్వారంటైన్ లోకి వెళ్లానన్నారు.
గత కొద్ది రోజులలో తనని కలిసిన వారందరు పరీక్షలు జరుపుకోవాలని తెలిపారు. మొన్నామధ్య మెగా బ్రదర్ నాగబాబు కూడా కరోనాని జయించి ఆరోగ్యవంతమైన జీవితం కొనసాగిస్తున్నారు.
చిరంజీవికి ఆ స్కూల్స్ కి ఏం సంబంధం లేదు..
నితిన్ భార్య ఫ్యామిలీకి చిరంజీవికి లింక్ ఏంటో తెలుసా ?