- Advertisement -
నేటి బాలలే రేపటి పౌరులనీ రేపటి పౌరులే దేశ భవిష్యత్తును తిరగరాయగలరనీ చిన్న వయస్సు నుంచే అందరూ దేశంపై ప్రేమ, భక్తి పెంచుకోవాలని వరంగల్ అర్బన్ కలెక్టర్ ఆమ్రపాలి అన్నారు. 20 వ అంతర్జాతీయ బాలల చలన చిత్ర ఫెస్టివల్ సందర్భంగా వివిధ పాఠశాలలోని విద్యార్థులకు జెమినీ సినిమా హల్ లో అమూల్యం అనే బాలల చిత్రాన్ని జ్యోతి ప్రజ్వలనా చేసి ప్రారంభించిన కలెక్టర్ ఆమ్రపాలి.
అనంతరం ఆమ్రపాలి మాట్లాడుతు నేటి నుంచి నవంబర్ 14 వ తేదీ వరకు జరుగు అంతర్జాతీయ బాలల చలన చిత్ర ఫెస్టివల్ సందర్భంగా వరంగల్ నగరంలోని పాఠశాల విద్యార్థులందరికి బాలల చలన చిత్రాలను తిలకించే విధంగా ఏర్పాటు చేస్తామని అన్నారు. బాలల చలన చిత్ర ఫెస్టివల్ సందర్భంగా బాలల అందరికి శుభాకాంక్షలు తెలిపిన కలెక్టర్ ఆమ్రపాలి.ఈ కార్యక్రమంలో జెడ్పి ఛైర్మెన్ గద్దల పద్మ ,DPRO జగన్ పాల్గొన్నారు.