Thursday, May 16, 2024
- Advertisement -

12 ఏళ్ల తరువాత నష్ట పరిహారం..!

- Advertisement -

12 ఏళ్ల క్రితం ముంబయిలో ఉగ్రదాడులకు పాల్పడిన ముష్కరుల చేతుల్లో ప్రాణాలు కోల్పోయనట్లు భావిస్తున్న ముగ్గురు మత్స్యకారుల కుటుంబాలకు ఇప్పుడు పరిహారం అందింది. ఒక్కో కుటుంబానికి రూ.5 లక్షల చొప్పున గుజరాత్ ప్రభుత్వం అందజేసినట్టు అధికారులు వెల్లడించారు. గుజరాత్​​కు చెందిన నతు రాథోడ్​, ముకేశ్​ రాథోడ్​, బల్వంత్​ తండెల్​ అనే ముగ్గురితో పాటు రమేశ్​ బంభానియా అనే మత్స్యకారుడు, డయ్యూకి చెందిన అమర్​సిన్హ్​ సోలంకి అనే కెప్టెన్​ కలిసి 2008 నవంబర్​లో చేపల వేటకు పడవ మీద సముద్ర జలాల్లోకి వెళ్లారు.

ఆ సమయంలో పాకిస్థాన్​ నుంచి వచ్చిన ఉగ్రవాదులు వారి పడవను బలవంతంగా తమ అధీనంలోకి తీసుకుని దాని మీద ముంబయికి చేరుకున్నారు. ఒడ్డుకు చేరాక వారిని కాల్చి చంపినట్లు అప్పట్లో అధికారులు భావించారు.

ఆ సమయంలో సోలంకి మృతదేహం ఉండగా మిగిలిన వారి ఆచూకీ తెలియరాలేదు. వారి మృతదేహాలు కనిపించకపోవడం కారణంగా వారు మరణించినట్లు అప్పట్లో ప్రభుత్వం ధ్రువీకరించలేదు. దీని వల్ల వారి కుటుంబాలకు పరిహారం అందలేదు. చివరకు 2017 ఫిబ్రవరిలో నవ్​సరి స్థానిక కోర్టు వారు చనిపోయినట్లు ధ్రువీకరించింది. దీంతో ఇప్పుడు వారి కుటుంబాలకు పరిహారం అందింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -