- Advertisement -
ఒకవైపు తెలంగాణా ప్రభుత్వం దసరా నుంచీ కొత్త జిల్లాలు మొదలెడదాం అని ప్లాన్లు వేస్తూ ఉంటె రోజుకొక కొత్త జిల్లా డిమాండ్ కెసిఆర్ ని విసిగిస్తోంది. ఏ ప్రాంతానికి చెందిన నాయకులు ఆ ప్రాంతంలో హడావిడి చేస్తున్నారు. ఖమ్మం జిల్లాలోని భద్రాచలంను జిల్లాగా ప్రకటించాలని భద్రాచలం ఎమ్మెల్యే సున్నం రాజయ్య ఈరోజు ఆమరణ నిరాహార దీక్షకు దిగారు.
అంతేగాక, వాజేడు, వెంకటాపురం మండలాలను భూపాల్పల్లి జిల్లాలో కలపడం పట్ల ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్లో కలిసిన నాలుగు పంచాయతీలను కూడా మళ్లీ భద్రాచలంలో కలపాలని ఆయన కోరుతున్నారు. తన డిమాండును సాధించేవరకు దీక్ష కొనసాగుతుందని అన్నారు.