Sunday, May 5, 2024
- Advertisement -

వైసీపీలోకి కాంగ్రెస్ నేత.. ఎవరంటే..?

- Advertisement -

ఏపీలో వ‌చ్చే సార్వ‌త్రిక ఎన్నిక‌లు ద‌గ్గ‌ర ప‌డుతున్న క్రమంలో వైసీపీలోకి వలసలు పెరుగుతున్నాయి. అలానే ఒక్కరు ఇద్దరు కూడా టీడీపీలోకి వెళ్తున్నారు. ఇటీవ‌ల నంద్యాల, కాకినాడ ఎన్నిక‌ల్లో ప‌రాజ‌యం చూసిన వైసీపీ.. ఆ తర్వాత కూడా ఖంగుతిన‌కుండా.. న‌వ‌ర‌త్నాలు, వైఎస్సార్ కుటుంబం ప‌థ‌కాల‌తో ప్ర‌జ‌ల్లోకి దూసుకుపోతుంది.

ఇప్పటికే వైసీపీ కుటుంబంలో 80 ల‌క్ష‌ల మంది వ‌చ్చి చేర‌గా.. అనేక మంది ముఖ్య నేత‌లు, కార్య‌క‌ర్తలు కూడా వైసీపీలోకి క్యూలు కట్టబోతున్నారు. అయితే ఇప్పుడు తాజాగా కాంగ్రెస్‌ నేత పీజేఆర్‌ సుధాకర్‌బాబు వైసీపీలో చేరారు. వైసీపీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో సుధాకర్‌బాబు తన అనుచరులతో కలిసి పార్టీలోకి వచ్చారు.

సుధాకర్‌బాబు గతంలో యువజన కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడిగా పనిచేశారు. ప్రజా సమస్యలపై పోరాటం చేస్తూ.. ప్రజల ఆదరాభిమానాలను సొంతం చేసుకుంటున్న వైసీపీలోకి పలువురు నేతలు చేరుతున్న విషయం తెలిసిందే.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -