సాధారణంగా ఎక్కడైనా మహిళలను పురుషులు వేధిస్తుంటారు.మహిళా ఉద్యోగులను సహోద్యోగులు, ఉన్నతాధికారులు లైంగిక వేధింపులకు ఎక్కువుగా గురిచేసినట్లు వింటూ ఉంటాం. అయితే ఇక్కడ సీన్ పూర్తిగా రీవర్స్.తమనే పెళ్లి చేసుకోవాల్సిందిగా ఇద్దరు మహిళా కానిస్టేబుళ్లు వెంటపడి వేధించడం విశేషం.ఇక్కడ మరో విశేషం ఏంటంటే..ఇతను కూడా కానిస్టేబులే. పూర్తి వివరాల్లోకి వెళ్తే….కొల్హపూర్ లోని రాజారాంపురి పోలీసు స్టేషనుకు చెందిన 42 ఏళ్ల పోలీసు కానిస్టేబుల్ ఇటీవల వివాహం చేసుకున్నాడు.
అయితే బాధితుడు 2012-14 మధ్యకాలంలో గాంధీనగర్ పీఎస్ లో పనిచేశాడు. ఈ సమయంలో అక్కడే ఉన్న ఇద్దరు మహిళా కానిస్టేబుళ్లతో ఏర్పడిన పరిచయం, అక్రమ సంబంధానికి దారితీసింది. తాజాగా బాధితుడు పెళ్లి చేసుకున్న విషయం తెలుసుకున్న ఇద్దరు కానిస్టేబుళ్లు తమనే పెళ్లి చేసుకోవాలని అతనిపై ఒత్తిడి తెచ్చారు. ఈ వేధింపులు హద్దులు దాటడంతో ఆవేదన చెందిన సదరు వ్యక్తి విషం తాగి ఆత్మహత్య చేసుకున్నాడు.