Tuesday, May 14, 2024
- Advertisement -

నోటికి ప‌నిచెప్పిన క‌త్తి.. విడుద‌ల చేసిన పోలీసులు

- Advertisement -

క్రిటిక్ క‌త్తిమ‌హేష్ ను అర్ధ‌రాత్రి పోలీసులు అరెస్ట్ చేసిన విష‌యం తెలిసిందే. ఓ ఛాన‌ల్ డిబేట్లో హిందువుల మ‌నోభావాలు దెబ్బ‌తినేలా మాట్లాడారంటూ ప‌లువురు ఆయ‌న‌పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదుతో కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు అర్ధ‌రాత్రి అదుపులోకి తీసుకున్నారు. అనంత‌రం కొద్దిసేప‌టి క్రితమే విడుద‌ల చేశారు.

క్రిటిక్ , తెలుగు బిగ్ బాస్ షో తొలి సీజ‌న్ కంటిస్టెంట్ గా బాగా ఫేమ్ లోకి వ‌చ్చారు. అప్పుడ‌ప్పుడు ఏదో వివాదంపై త‌న‌దైన స్టైల్లో ట్వీట్స్ , కామెంట్స్ చేయ‌డంతో క‌త్తిమ‌హేష్ పై బాగా పేరు సంపాదించారు. అప్ప‌టి నుంచి ప‌లు ఛాన‌ళ్ల‌లో డిబెట్ల‌లో పాల్గొంటూ త‌న ఆలోచ‌న‌ల్ని స‌ద‌రు యాంక‌ర్ల‌పై , అంశంపై ప్ర‌యోగించేవారు. ప‌లుమార్లు క‌త్తిపై కేసులు న‌మోదు అయ్యాయి. వాటి నుంచి విముక్తికూడా దొరికింది. అయితే కొన్ని రోజులు సైలెంట్ గా ఉన్న క‌త్తి మ‌రోమారు త‌న‌నోటికి ప‌నిచెప్పారు. ఓ ఛాన‌ల్ డిబెట్ లో హిందువుల మ‌నోభావాలు దెబ్బ‌తినేలా కామెంట్ చేశారు.

రామాయణం అనేది నాకొక కథ. రాముడనే వాడు దగుల్బాజీ అని నేను నమ్ముతా.. ఆ కథలో సీత బహుశా రావుణుడితోనే ఉంటే బాగుండేదేమో, ఆవిడకి న్యాయం జరిగి ఉండేదేమో అని నేననుకుంటాన‌ని కామెంట్ చేశారు. అంతే దీనిపై హిందూ ఆధ్యాత్మిక సంఘాల వారు, ప‌లువురు క‌త్తిమ‌హేష్ పై పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదుతో క‌త్తిని బంజారాహిల్స్ పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించారు. విచార‌ణంలో తాను పోలీసుల‌కు స‌హ‌క‌రించినట్లు, కేసుకు సంబంధించి ప‌లు ప్ర‌శ్న‌లు వేసిన‌ట్లు..అనంత‌రం త‌న‌ని విడుద‌ల చేసిన‌ట్లు క‌త్తి ట్వీట్ చేశారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -