Friday, May 3, 2024
- Advertisement -

దేశంలో కొత్త క‌రోనా కేసుల వివ‌రాలు

- Advertisement -

దేశంలో కరోనా వైరస్ (కోవిడ్-19) కేసులు క్ర‌మంగా తగ్గుతున్నాయి. తాజాగా కేంద్ర ఆరోగ్య‌, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్ల‌డించిన వివ‌రాల ప్ర‌కారం.. గ‌త 24 గంట‌ల్లో కొత్త‌గా 31,222 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయి క‌రోనాతో మ‌రో 290 మంది మృతి చెందారు. దీంతో దేశంలో క‌రోనా కేసుల సంఖ్య మొత్తం 3,30,58,843కి చేరింది. మొత్తం మృతుల సంఖ్య 4,41,042కి పెరిగింది.

అలాగే నిన్న క‌రోనా నుంచి 42,942 మంది కోలుకున్నారు. 3,92,864 మందికి ఆసుప‌త్రులు, హోం క్వారంటైన్‌ల‌లో చికిత్స అందుతోంది. ఇప్పటి వరకు దేశంలో మొత్తం 69,90,62,776 డోసుల వ్యాక్సిన్లను వినియోగించారు.

మరోపక్క, 24 గంటల్లో కేరళ రాష్ట్రంలో 19,688 కేసులు న‌మోదు కాగా, ఆ రాష్ట్రంలో నిన్న‌ 135 మంది ప్రాణాలు కోల్పోయారు. దేశంలో నమోదవుతున్న కేసులలో 2 వంతులకు పైగా కరోనా కేసులు ఒక కేరళ రాష్ట్రంలోనే నమోదవుతున్నాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -