- Advertisement -
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర వాయుగుండంగా మారిన విషయం తెలిసిందే. విశాఖ వాతావరణ శాఖ అంచనా ప్రకారం మరో 12 గంటల్లో తుపాన్గా రూపాంతరం చెందుతుందని అంచనా. ఈ తుపాన్ కు ‘బుల్ బుల్’ గా నామకరణం చేశారు.
అండమాన్ నికోబార్ దీవులకు పశ్చిమ వాయువ్య దిశగా 200 కిలోమీటర్లు పారాదీప్కు దక్షిణ ఆగ్నేయ దిశగా 920 కిలోమీటర్ల దూరంలో వాయుగుండం కేంద్రీకృతమై ఉంది. ఈ ‘బుల్ బుల్’ తుపాన్ వాయువ్య దిశగా మెల్లగా కదులుతు ఈనె 10వ తేదీ నాటికి తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనావేసింది.
ఈ ‘బుల్ బుల్’ తుపాన్ ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, ఒడిషాలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని… ఆంధ్రప్రదేశ్ ఉత్తర కోస్తాలో భారీగా వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.