Friday, May 10, 2024
- Advertisement -

వివరాలు వెల్లడించిన సిఐడి

- Advertisement -

కాపు రిజర్వేషన్ ఉద్యమంలో భాగంగా తునిలో కొన్ని అరాచకశక్తులు బీభత్సం చేసిన సంగతి గుర్తుండే ఉంటుంది. ఆ సంఘటనకు బాధ్యులైన వారిని సిఐడి అదుపులోకి తీసుకుంది. దీనిపై మీడియాకు సమాచారం కూడా ఇచ్చింది. ఈ ఘటనలో అరెస్టు అయిన దూడల మణీంద్ర అమలాపురానికి చెందిన వాడని, అతనిపై రౌడీ షీట్ ఉందని సిఐడి వర్గాలు చెబుతున్నాయి.

ఇంతకు ముందు ఇతను 2015లో హత్యాయత్నం, 2012లో హత్య, 2009 సంవత్సరంలో అధికారులపై దాడి కేసుల్లో నిందితుడని పేర్కొన్నారు. ఇతనితో పాటు గుంటూరుకు చెందిన లక్కింశెట్టి శివ, పవన్ కుమార్ తుని ఘటనలో విలేకరి నుంచి సెల్ ఫోన్ లాక్కున్నారని వారు చెప్పారు. వీరి నుంచి సెల్ ఫోన్ రికవరీ చేసుకున్నామన్నారు. ఈ ఘటనకు సంబంధించి మరికొంతమందిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు.  

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -