Tuesday, May 21, 2024
- Advertisement -

చంద్ర‌బాబుకు వ‌ర్మ ఓపెన్ చాలెంజ్‌…ద‌మ్ముంటె ఆపుకో

- Advertisement -

సినిమా ఇండ‌స్ట్రీలో సంల‌చ‌నాల‌కు మారు పేరైన ర్శ‌కుడు రామ్ గోపాల్ వ‌ర్మ మ‌రో సంచ‌ల‌నానికి తెర‌లేపారు.టీవలే తన లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రాన్ని ఏపీలో రిలీజ్ చేసేందుకు వర్మ చేసిన ప్ర‌య‌త్నాల‌ను టీడీపీ ప్ర‌భుత్వం అడ్డుకున్న సంగ‌తి తెలిసిందే. కొద్ది రోజుల క్రితం విజయవాడ ఎన్టీఆర్ సర్కిల్లో ప్రెస్ మీట్ పెట్టాలని ప్రయత్నించగా, పోలీసులు అదుపులోకి తీసుకుని హైదరాబాద్ తిప్పి పంపారు.

అయితే అధికారంలోకి వైసీపీ రావ‌డంతో వ‌ర్మ చెల‌రేగిపోతున్నారు. ఎక్కడైతే తనను మాజీ ముఖ్యమంత్రి అరెస్ట్ చేయించారో అదే ఎన్టీఆర్ సర్కిల్లో ఎల్లుండి నాలుగు గంటలకు ప్రెస్ మీట్ పెడుతున్నానని, అడ్డుకునేదెవరో ముందుకు రావాలంటూ సవాల్ విసిరారు.

విజయవాడలోని అదే పైపుల రోడ్డులో ప్రెస్ మీట్ పెడుతున్నా… బస్తీ మే సవాల్” అంటూ ట్వీట్ చేశారు. నిజమైన ఎన్టీఆర్ అభిమానులకు ఇది తన బహిరంగ ఆహ్వానం అంటూ చివర్లో జై జగన్ నినాదంతో ముగించారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -