- Advertisement -
టీడీపీ ప్రభుత్వానికి మరో బిగ్ షాక్ తగిలింది. అధికార పార్టీకి సహకరిస్తున్నారంటూ ఐజీ చీఫ్, ఇద్దరు ఐపీఎస్ అధికారులను తప్పించిన సీఈసీ తాజాగా ఏసీబీ డీజీ బాధ్యతలనుంచి ఠాకూర్ను తప్పింది. ఠాకూర్ ఏపీ డీజీపీతో పాటు ఏసీబీ ఏసీబీ డీజీగా అదనపు బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. గతంలో కూడా ఠాకూర్పై అనేక విమర్శలు వచ్చాయి. ఈసీతో ఏపీ డీజేపీ ఆర్.పీ.ఠాకూర్ భేటీ అయిన తర్వాత ఈ నిర్ణయం వెలువడటం విశేషం. ఏసీబీ డీజీగా ఎస్.బి బాగ్చీని నియమిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది.