Saturday, May 11, 2024
- Advertisement -

యాత్ర సినిమా టీవీల్లో ప్రసారంపై టీడీపీకీ ఈసీ బిగ్ షాక్…

- Advertisement -

వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవితం ఆధారంగా మమ్మూట్టి హీరోగా యాత్ర సినిమాను టీవీల్లో ప్రసారం కాకుండా ఆపుచేయాలని చేసిన టీడీపీ నేతలకు ఈసీ బిగ్ షాక్ ఇచ్చింది. స్టార్ మా ఛానల్ లో రేపు మధ్యాహ్నం 12 గంటలకు ప్రసారం కానున్న యాత్ర సినిమా ఎన్నికల నియమావళిని ఏ రకంగానూ ఉల్లంఘించడం లేదని ఈసీ స్పష్టం చేసింది. టీడీపీ నేతల ఫిర్యాదును తమ మీడియా సర్టిఫికేషన్ కమిటీ పరిశీలించిందనీ, అందులో ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించే అంశాలేవీ లేవని తేల్చిచెప్పింది. దీంతో టీవీల్లో ప్రసారం చేసుకోవచ్చని ఈసీ తెలిపింది. దీంతో యాత్ర సినిమాకు లైన్ క్లియర్ అయ్యింది.

ఎన్నికలకు 4 రోజుల ముందు యాత్ర సినిమాను టీవీల్లో ప్రసారం చేయడంపై టీడీపీ నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ చిత్రంతో ఓటర్లు ప్రభావితమయ్యే అవకాశముందని, పోలింగ్ ముగిసేవరకు చిత్రాన్ని ప్రదర్శించకుండా ఆదేశాలు ఇవ్వాలని ఈసీని కోరారు. టీడీపీ నేతల ఫిర్యాదును పరిశీలించిన ఈసీ.. యాత్ర సినిమా నిలిపివేసేందుకు నో చెప్పింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -