Friday, May 17, 2024
- Advertisement -

”ఆగష్టు నెలాఖరులోగా ఇంజనీరింగ్ అడ్మిషన్లు పూర్తి”

- Advertisement -

నిర్ణీత తేదీ ప్రకారమే ఎమ్సెట్ కౌన్సిలింగ్ చేస్తామని ఉన్నత విద్యామండలి ఛైర్మన్ వేణుగోపాలరెడ్డి చెప్పారు. అయితే తెలంగాణలో సర్టిఫికెట్ల పరిశీలనకు మరి కొద్ది గడువు కావాలని తెలంగాణ అధికారులు కోరారని, అందుకు ఇబ్బంది లేదని,రెండు ,మూడు రోజులు ఆలస్యంగా ప్రక్రియ మొదలవుతుందని అన్నారు.

అయితే సుప్రీం ఆదేశాల ప్రకారం ఎట్టి పరిస్థితిలోను ఇరవై మూడు నాటికి సర్టిఫికెట్ల పరిశీలన పూర్తి చేసి, కౌన్సిలింగ్ నిర్వహించి, సెప్టెంబరు ఒకటి నుంచి ఇంజనీరింగ్ కాలేజీలలో క్లాస్ లు ఆరంభమవుతాయని అన్నారు.రెండు రాష్ట్రాలలోను ఇదే ప్రకారం జరుగుతుందని వేణుగోపాలరెడ్డి అన్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -