Monday, May 6, 2024
- Advertisement -

ఎంసెట్ సమస్య.. ఓ కొలిక్కి.. ఇలా చేస్తే ర్యాంక్ ఫిక్స్..!

- Advertisement -

జూన్ 14 తర్వాత ఎంసెట్ నిర్వహించనున్నట్లు ఉన్నత విద్యా మండలి ఛైర్మన్ పాపిరెడ్డి తెలిపారు. ఎంసెట్ సిలబస్ పై ఇవాళ ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. పాపిరెడ్డి, చిత్రా రామచంద్రన్, సాంకేతిక విద్యా శాఖ కమిషనర్ నవీన్ మిట్టల్, ఇంటర్ బోర్డు కార్యదర్శి జలీల్, జేఎన్ టీయూహెచ్ అధికారులు హాజరయ్యారు. ఎంసెట్ సిలబస్​పై ఈ ఏడాది అధికారిక ప్రకటన వెల్లడించనున్నారు.

ఎంసెట్​లో ఇంటర్ ద్వితీయ సంవత్సరంలో 70 శాతం.. మొదటి సంవత్సరంలో పూర్తి సిలబస్ నుంచి ప్రశ్నలు ఇవ్వాలని విద్యా శాఖ నిర్ణయించింది. జేఈఈ తరహాలోనే ఈ ఏడాది ఎంసెట్​లో ఛాయిస్ ఇవ్వనున్నారు. ఎన్ని ప్రశ్నలు అదనంగా ఇవ్వాలో నిపుణులపై చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు.

ఎంసెట్ ర్యాంకుల ఖరారులో ఇంటర్ మార్కులకు 25 శాతం వెయిటేజీ యథాతథంగా కొనసాగుతుందని, మార్పు లేదని విద్యా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి చిత్ర రామచంద్రన్ తెలిపారు.

ఈ నెల 7న ముహూర్తం పెట్టిన సీఎం కేసీఆర్..!

ప్రముఖ నటుడు కాంతారావు సతీమణి కన్నుమూత!

జనసేన అభిమానులకు చెక్‌ పెట్టిన సోము వీర్రాజు!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -