వైసీపీ వాళ్లపై కేసులు పెట్టడంలో కాదు పోటీ పడేది.. అభివృద్ధిలో పోటీపడండి అని సూచించారు మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి. మీడియాతో మాట్లాడిన జగన్..వైఎస్ జగన్ క్వాలిటీ ఫుడ్ అంటే అందరూ వెక్కిరించారు.. ఇప్పుడేమైంది అన్నారు.
ఈరోజు #Kutami ప్రభుత్వంలో విద్యార్థులకు వడ్డించే భోజనంలో బొద్దింకలు.. జెర్రీలు వస్తున్నాయి.. గతంలో చిన్న విషయం జరిగినా స్టేట్ అంతా చూసేది అన్నారు. శ్రీకాళహస్తిలో రెండోసారి విద్యార్థులకు ఫుడ్పాయిజన్.. అయ్యా.. ప్రశ్నించే పవన్ కళ్యాణ్ ఎక్కడున్నావ్ చెప్పాలన్నారు.
మొన్న బొద్దింక.. ఇవాళ జెర్రీ..శ్రీకాళహస్తి ప్రభుత్వ బాలికల వసతి గృహంలో ఉప్మా తిని అస్వస్థతకు గురయ్యారు విద్యార్థినులు. ఉప్మాలో జెర్రీ కనిపించడంతో మిగిలిన విధ్యార్థినులను అప్రమత్తం చేయడంతో పెనుముప్పు తప్పింది. టిఫిన్ తిన్న ముగ్గురు విద్యార్థినులు ఆస్పత్రికి తరలించగా విద్యాశాఖలో నిర్లక్ష్యంపై విద్యార్థినుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
