ప్రముఖ ఈ కామర్స్ సంస్థ ఫ్లిప్కార్ట్ మరోసారి ఆఫర్లతో వినియోగదారుల ముందుకు రానుంది. డిసెంబరు 6 నుంచి 8 వరకు మూడు రోజుల పాటు బిగ్ షాపింగ్ డే పేరిట సేల్స్ నిర్వహించనున్నట్లు ప్రకటించింది. స్మార్ట్ఫోన్లు, ఎలక్ట్రానిక్ ఉత్పత్తులపై భారీగా డిస్కౌంట్ ప్రకటించింది.
రెడ్మీ నోట్ 6 ప్రో, గూగుల్ పిక్సెల్ 2 ఎక్స్ఎల్, ఆసుస్ జెన్ఫోన్ లైట్ ఎల్1, పోకో ఎఫ్1, రియల్ మి సీ1 స్మార్ట్ఫోన్లతో పాటు పలు కంపెనీల ఫోన్లపై భారీ డిస్కౌంట్ లభించనుంది. ఫ్యాషన్, హోం ఫర్నీచర్ దగ్గర నుంచి టెలివిజన్, గృహోపకరణాలపై భారీ డిస్కౌంట్ను ప్రముఖ ఈ కామర్స్ సంస్థ ఫ్లిప్కార్ట్ ప్రకటించింది.
ఆసుస్ జెన్ఫోన్ లైట్ ఎల్1 ఫోన్ రూ.2000 డిస్కౌంట్తో రూ.4,999కే లభించనుంది. దీనికి సంబంధించిన ఫ్లాష్ సేల్ను ఈ నెల 6న మధ్యాహ్నం 12 గంటలకు నిర్వహించనుంది. రెడ్మీ నోట్ 6 ప్రో అయితే ఈ మూడు రోజులపాటు ఫ్లాష్ సేల్లో ఉంటుంది.
ఈ ఆఫర్ కింద హెచ్డీఎఫ్సీ క్రెడిట్, డెబిట్ కార్డు వినియోగదారులకు 10% డిస్కౌంట్ను ప్రకటించింది. ఈ రాయితీ ఈఎంఐ లావాదేవీలకు కూడా వర్తిస్తుందని హెచ్డీఎఫ్సీ వెల్లడించింది. బజాజ్ ఫైనాన్స్ సర్వీసెస్, ఇతర బ్యాంకులు కూడా మొబైల్ బైబ్యాక్ గ్యారెంటీ ఆఫర్లను కూడా ప్రకటించాయి.
స్మార్ట్ఫోన్లతో పాటు టెలివిజన్లు, గృహోపకరణాలపై 70 శాతం రాయితీ, ల్యాప్ట్యాప్, కెమెరా, ఆడియో యాక్ససరీస్పై 80శాతం రాయితీని ప్రకటించాయి. ఇక ఫ్యాషన్, హోం ఫర్నీచర్పై 40 నుంచి 80 శాతం, బ్యూటీ, టాయ్స్, స్పోర్ట్స్, బుక్స్ ఇతర వస్తువులపై 80శాతం రాయితీని ఇస్తున్నట్లు ఫ్లిప్కార్ట్ తెలిపింది.