Sunday, May 5, 2024
- Advertisement -

పెళ్లి కోసం.. మోదీ సంతకం ఫోర్జరీ..?

- Advertisement -

పెళ్లికోసం ప్రధాని నరేంద్ర మోదీ సంతకాన్ని ఫోర్జరీ చేసినందుకు మహారాష్ట్రకు చెందిన అమిత్​ కపూర్​ను పోలీసులు అరెస్టు చేశారు. రాజస్థాన్​ అల్వార్​కు చెందిన ఓ అమ్మాయితో 2018లోనే ఇతగాడికి పరిచయమైంది. ప్రధాని కార్యాలయం(పీఎంఓ)లో పనిచేస్తానంటూ నమ్మించి ఆమె కుటుంబ సభ్యులకు దగ్గరయ్యాడు. ప్రధాని మోదీ సంతకం ఉన్న ఓ అపాయింట్​మెంట్​ పత్రాన్ని కూడా చూపాడు. ఇదంతా నిజమని నమ్మిన కుటుంబ సభ్యులు వారమ్మాయిని ఇతనికిచ్చి వివాహం చేశారు. కానీ అతడో మోసగాడనే అసలు విషయం తర్వాత తెలుసుకున్నారు.

తమను అమిత్​ కుమార్ మోసం చేశాడని కోత్వాలీ పోలీస్​ స్టేషన్​లో అమ్మాయి కుటుంబ సభ్యులు పిర్యాదు చేశారు. ప్రధాని సంతకాన్ని నిందితుడు ఫోర్జరీ చేసినట్లు వివరిస్తూ పీఎంఓకు లేఖ రాశారు. దీంతో ఈ విషయంపై రాజస్థాన్​ డీజీపీకి పీఎంవో మే 8న లేఖ రాసింది. పూర్తిస్థాయి దర్యాప్తు జరపాలని సీబీఐని కోరింది.పరారీలో ఉన్న నిందితుడ్ని పక్కా సమాచారంతో రాజస్థాన్​ అల్వార్​లో సోమవారం అరెస్టు చేశారు పోలీసులు. అనంతరం కోర్టులో హాజరుపరిచారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -