- Advertisement -
టీవీ9 సీఈవో రవిప్రకాశ్ పరారీలో ఉన్నారు. గత రెండు రోజులుగా ఆయనకోసం తెలంగాణా పోలీసులు వేట ప్రారంభించారు.యాజమాన్యానికి తెలియకుండా నిధుల మళ్లించారంటూ రవిప్రకాశ్పై సైబర్ క్రైమ్లో కేసు నమోదు అయింది. నిధుల మళ్లింపు జరిగిందని ఆరోపిస్తూ అలంద మీడియా ఎంటర్టైన్మెంట్స్ సంస్థ…సీఈవోపై ఫిర్యాదు చేసింది.
అంతేకాకుండా తన సంతకాన్ని రవిప్రకాశ్ ఫోర్జరీ చేశారంటూ అలంద మీడియా కార్యదర్శి కౌశిక్ రావు తన ఫిర్యాదులో పేర్కొన్నారు. రవిప్రకాశ్ ఇంట్లో, టీవీ9 కార్యాలయంలో పోలీసులు సోదాలు నిర్వహిస్తున్నారు.కాగా కొద్దిరోజుల కిందటే ఏబీసీఎల్ కార్పొరేషన్ నుంచి టీవీ9ను అలంద మీడియా టేకోవర్ చేసింది. కాగా రవిప్రకాశ్ విదేశీ పర్యటనలో ఉన్నట్లు సమాచారం. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.