Thursday, April 25, 2024
- Advertisement -

కరోనా కాటుకు మాజీ ఎంఎల్ఎ చిట్టబ్బాయి కన్నుమూత!

- Advertisement -

ఈ మద్య తెలుగు రాష్ట్రాల్లో కరోనా విజృంభణ భారీ స్థాయిలో పెరిగిపోయింది. మొన్నటి వరకు వందల్లో ఉన్న కేసులు ఇప్పుడు పదివేల వరకు పెరిగాయి. దాంతో పాటు మరణాల సంఖ్య కూడా పెరిగిపోయాయి. కరోనా కాటుకు ఇటీవల రాజకీయ నేతలు వరుసగా కన్నుమూస్తున్న విషయం తెలిసిందే.

ఈ నేపథ్యంలో బిసి నేత, మాజీ ఎంఎల్ఎ కుడిపూడి చిట్టబ్బాయి కరోనాతో కన్నుమూశారు. గత వారం రోజుల క్రితం చిట్టబ్బాయి కరోనా భారిన పడ్డారు. అప్పటి నుంచి ఆయన కాకినాడలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

ఆయన చికిత్స పొందుతూ.. గురువారం తుదిశ్వాస విడిచారు. చిట్టబ్బాయి మృతితో కోనసీమ ప్రాంతం శోకసంద్రంలో మునిగిపోయింది. సిఎం జగన్ మోహన్ రెడ్డి, వైెఎస్ఆర్ సిపి రైతు విభాగం అధ్యక్షుడు, అగ్రి మిషన్ వైస్ చైర్మన్ ఎంవిఎస్ నాగిరెడ్డి, వైఎస్ఆర్ సిపి నాయకులు సంతాపం తెలిపారు.

కరోనా ఎఫెక్ట్.. వెంకటేష్ ‘నారప్ప’ విడుదల వాయిదా

చెర్రీ సరసన మరోసారి బాలీవుడ్ బ్యూటీ!

రేపటి మినీ పోరుకు సర్వం సిద్దం…

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -