Friday, May 17, 2024
- Advertisement -

మహిళా సాఫ్ట్‌వేర్‌పై నీచానికి ఒడిగ‌ట్టి తొటి ఉద్యోగులు…

- Advertisement -

దేశ‌లో మహిళల రక్షణ, భద్రత కోసం అధికారులు ఎన్ని చర్యలు తీసుకున్నా, ఎన్ని ప్ర‌భుత్వాలు ఎన్ని చ‌ట్టాలు తీసుకున్నా వారిపై చ‌ట్ట‌కుంటున్నా వారిపై మాత్రం అఘాయిత్యాలు ఆగ‌డ‌లేదు.తాజాగా ఓ మ‌హిళా సాఫ్ట్‌వేర్ ఉద్యోగిన‌పై స‌హోద్యోగులే దారుణానికి ఒడి గట్టారు. ఈ సంఘ‌ట‌న ఢిల్లీలో చోటు చేసుకుంది.

ఢిల్లీలోని ద్వారక ప్రాంతంలో బాధితురాలు సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పనిచేస్తోంది. ఈ నేపథ్యంలో ఆమె సహోద్యోగులు బిర్జూ(25), వినోద్ కుమార్(31)లు ఇంటి వద్ద డ్రాప్ చేస్తామని నమ్మబలికారు. దీంతో బాధితురాలు వారి కారులో ఎక్కింది. ఈ సందర్భంగా నిందితులు మత్తుమందు కలిపిన కూల్ డ్రింక్ ను ఆమెకు అందించారు. కొద్దిసేపటికే స్పృహ కోల్పోవడంతో ఆమెను తమ ఫ్లాట్ కు తీసుకెళ్లి ఒకరి తర్వాత మరొకరు అత్యాచారం చేశారు.

ఆ తర్వాత బాధితురాలిని తన ఇంటికి సమీపంలోని వసంత్ కుంజ్ ఏరియా ప్రాంతంలో వదిలేసి వెళ్లారని ద్వారకా నార్త్ పోలీసులు తెలిపారు. ఇంటికి చేరుకొన్న తర్వాత బాధితురాలు కుటుంబసభ్యులకు ఈ విషయాన్ని చెప్పింది. కుటుంబసభ్యుల సహయంతో బాధితురాలు ఆదివారం నాడు పోలీసులకు ఫిర్యాదు చేసింది.

ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు. బాధితురాలికి వైద్య పరీక్షలు నిర్వహించగా, అత్యాచారం జరిగినట్లు తేలింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -