ఇద్దరు రేపిస్ట్లు ఓ యువతికి నరకం చూపించారు. ఓ గదిలో నిర్బంధించి రెండు రోజుల పాటు అత్యాచారానికి పాల్పడ్డారు. వాళ్ల నుంచి తప్పించుకునేందుకు..ఏకంగా భవనం మూడో ఫ్లోర్ నుంచి నగ్నంగా దూకేసింది బాధితురాలు.జైపూర్లోని ముహానా పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిందీ ఘటన.
పోలీసుల కథనం ప్రకారం రాజస్థాన్కు చెందిన లోకేశ్ సైనీ (19), కమల్ సైనీ (20) అనే ఇద్దరు యువకులు 23 ఏళ్ల నేపాలీ యువతిని బంధించారు. శుక్రవారం నుంచి ఆమెపై అత్యాచారానికి పాల్పడుతూనే ఉన్నారు. వారినుంచి తప్పించుకొనే క్రమంలో మూడో అంతస్తునుంచి దూకడంతో తీవ్ర గాయాలపాలైన బాధితురాలు ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఆమె ఫిర్యాదు మేరక పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఇద్దరిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.
అంతేకాకుండా చిత్రహింసలు పెట్టి నరకం చూపించారు. వారి నుంచి తప్పించుకునేందుకు నగ్నంగా భవనం మీద నుంచి కిందకు దూకేసింది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించింది. బాధితురాలికి గతంలో నిందితులతో పరిచయం ఏమైనా ఉందా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.