Friday, May 3, 2024
- Advertisement -

టీడీపీకీ షాక్ …ఆళ్ల‌గ‌డ్డ‌లో టీడీపీకీ షాక్ …వైసీపీకీ జై కొట్టిన మాజీ ఎంపీ

- Advertisement -

ఆళ్ల‌గ‌డ్డ‌ రాజ‌కీయాలు గ‌మ్మ‌త్తుగా సాగుతున్నాయి. పోలింగ్‌కు వారంరోజుల స‌మ‌యం ఉండ‌గానే క‌ర్నూలు జిల్లాలో టీడీపీకీ బిగ్ షాక్ త‌గిలింది. నంద్యాల పార్ల‌మెంట్ నియోజ‌క వ‌ర్గంలో మంచి ప‌ట్టున్న నేత గంగుల ప్ర‌తాప్ రెడ్డి టీడీపీకీ షాక్ ఇస్తూ వైసీపీ మ‌ద్ద‌తు తెల‌ప‌డం సంచ‌ల‌నంగా మారింది. నంద్యాలకు ఉప ఎన్నికలు జరిగిన వేళ, టీడీపీలో చేరిన గంగుల, ఇప్పటివరకూ అదే పార్టీలో కొనసాగుతూ వచ్చారు. కానీ, మంగళవారం ఒక్కసారిగా పరిస్థితి మారిపోయింది.

ఆళ్ల‌గ‌డ్డ నుంచి టీడీపీ త‌రుపున అఖిల పోటీ చేస్తుండ‌గా వైసీపీ త‌రుపునుంచి గంగుల బ్రిజేంద్ర‌ర్ రెడ్డి పోటీ చేస్తున్నారు. ఇరు కుంటుంబాలు రాజీకీయ నేప‌థ్యం ఉన్న‌వి కావ‌డంతో పోరు ర‌స‌వ‌త్త‌రంగా ఉంటుంద‌న‌డంలో సందేహంలేదు. అయితే చివ‌రి నిమిషంలో గంగుల కుటుంబాలు ఒక‌టి కావ‌డంతో అఖిల‌కు కోలుకోలేని దెబ్బ త‌గిలింది. బిజేంద్రను గెలిపించేందుకు కృషి చేయాలంటూ, తన కుటుంబీకులకు సలహాలు, సూచనలను ఆయన ఇచ్చారు.

నంద్యాల ఉప ఎన్నిక సమయంలో చంద్రబాబు తనను సాయం కోరారని.. అందుకే టీడీపీ అభ్యర్థి కోసం పనిచేశానన్నారు. పార్టీలో చేరిక సమయంలో నంద్యాల పార్లమెంట్‌కు సరైన అభ్యర్థి ఎవరూ లేరని తనతో చెప్పారన్నారు. కాని త‌న‌కు చెప్ప‌కుండానె అభ్య‌ర్ధిని బాబు ప్ర‌క‌టించార‌ని ప్ర‌తాప్ రెడ్డి మండిప‌డ్డారు. అందుకే ఇప్పుడు వైసీపీకీ మ‌ద్ద‌తు ఇస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు. నంద్యాల ఉప ఎన్నిక స‌మ‌యంలో టీడీపీలో చేరిన ప్ర‌తాప్ రెడ్డి భూమా బ్ర‌హ్మానంద‌రెడ్డి గెలుపులో ముఖ్య‌పాత్ర పోషించ‌డం తెలిసిందే.నంద్యాల ఎంపీ టికెట్ ఆశించినా దక్కలేదు. అప్పటి నుంచి పార్టీ కార్యక్రమాలకు గంగుల దూరంగా ఉంటూ వచ్చారు. తీరా పోలింగ్ కు వారంరోజుల ముందు వైసీపీ అభ్య‌ర్ధిని భారీ మెజారిటీతో గెలిపించాల‌ని పిలుపు నివ్వ‌డం ప్రాధాన్య‌త‌ను సంత‌రించుకుంది. ప్ర‌తాప్ రెడ్డి యూట‌ర్న్ తీసుకోవ‌డం అఖిల‌కు కోలుకోలేని దెబ్బే త‌గిలింద‌న‌డంలో సందేహంలేదు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -