రాస్ట్రంలో టీడీపీకి ఎదురు గాలి వీస్తోంది. పార్టీ నుంచి నాయకులు ఒక్కోక్కురు ప్రతిపక్షపార్టీలోకి క్యూ కడుతున్నారు దీంతో బాబుకు ఆందోళన మొదలయ్యింది. ఇప్పటికే సీనియర్లు అంటీ ముట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు. ఇక తాజాగా కృష్ణా జిల్లాలో మరో ఎమ్మెల్యే వైసీపీలోకి వెల్తారన్న వార్తలు ఇప్పుడు హల్చల్ చేస్తున్నాయి.
గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ వైసీపీ కండువా కప్పుకోవడానికి ప్రయత్నాలు ముమ్మరంగా చేస్తున్నట్లు సమాచారం.దీనికి ప్రధాన కారనం గతంలో విజయవాడలో జగన్ పర్యటించినపుడు ఆయన్ను వంశీ ఆలింగనం చేసుకోవడం అప్పట్లో సంచలనంగా మారింది. పార్టీలోకి తీసుకొచ్చేందుకు వంగవీటి రాధ,కొడాలి నాని,ఇతర సీనియర్ నాయకులు వంశీని చేస్తున్న ప్రయత్నాలు ఫలించాయంటున్నారు.
{loadmodule mod_custom,Side Ad 1}
ప్రస్తుతం పార్టీలో సినయర్లు ఎక్కువ అవడంతోపాటు …వంశీకి ప్రాధాన్యత ఇవ్వడంలేదనే వార్తలు వినిపిస్తున్నాయి.వచ్చే ఎన్నికల్లో ఏపార్టీ తరుపున పోటీ చేసినా గెలిచే అవకాశం ఉండటంతో ఆయన వైసీపీలోకి వచ్చేందుకే మొగ్గుచూపుతున్నట్లు సమాచారం.ఒక వేల టీడీపీలో ఉంటె మంత్రి అయ్యే అవకాశం కనిపించకపోవడంతో ..జగన్తో మంత్రి హామి తీసుకొని పార్టీలోకి వచ్చేందుకు సిద్దంగా ఉన్నారంట.
{loadmodule mod_custom,Side Ad 2}
జగన్ కుటుంబంతో న్యూజిలాండ్ పర్యటనలో ఉన్నారు. ఆయన వ చ్చిన తర్వాత దీనిపై నిర్ణయం తీసుకోనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. మంత్రి స్థాయికి ఎక్కడా తగ్గకుండా భారీ స్తాయిలో తన అణుచర గనంతో వైసీపీలోకి చేరుతారనే ఉహాగానాలు వినిపిస్తున్నాయి. అదే జరిగితే కృష్ణా జిల్లాలో వైసీపీ మరింత పుంజుకుంటుందనడంలో సందేహంలేదు.
{loadmodule mod_sp_social,Follow Us}
{youtube}8RMa9XYiebY{/youtube}
Also Read