Wednesday, April 24, 2024
- Advertisement -

పండుగ నాడు శుభ వార్త.. భారత్ లో కొవిడ్ అంతం దిశగా..!

- Advertisement -

దేశంలో కరోనా కేసులు తగ్గాయి. తాజాగా 15,968 మందికి కొవిడ్ పాజిటివ్​గా నిర్ధరణ అయింది. మొత్తం బాధితుల సంఖ్య 1 కోటి 4లక్షల 95వేల 147కు పెరిగింది. వైరస్ ధాటికి మరో 202మంది బలవ్వగా.. మృతుల సంఖ్య 1లక్షా 51వేల 529కి చేరింది.

తాజాగా 17వేల మందికిపైగా వైరస్ నుంచి కోలుకున్నారు. ఫలితంగా కరోనాను జయించిన వారి సంఖ్య 1కోటి 1లక్ష 29వేల 111కి చేరింది. 2లక్షల 14వేల 507 యాక్టివ్ కేసులున్నాయి. దేశవ్యాప్త రికవరీ రేటు 96.43 శాతానికి ఎగబాకింది. మరణాల రేటు 1.44 శాతంగా నమోదైనట్టు కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది.

దేశవ్యాప్తంగా మంగళవారం ఒక్కరోజే 8లక్షల 36వేలకు పైగా నమూనాలను పరీక్షించినట్టు భారత వైద్య పరిశోధనా మండలి(ఐసీఎంఆర్) తెలిపింది. ఫలితంగా మొత్తం టెస్టుల సంఖ్య 18కోట్ల 36లక్షలు దాటింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -