Sunday, May 19, 2024
- Advertisement -

గవర్నర్ గిరీ కోసం కొట్టుకుంటున్నారు

- Advertisement -
governor post

తెలంగాణ నుంచి తేరాస నేత ఒక‌రు, తేదేపా నేత ఒక‌రు ప్ర‌స్తుతం గ‌వ‌ర్న‌ర్ పోస్ట్ కోసం సీరియ‌స్‌గా ప్ర‌య‌త్నం చేస్తున్నార‌న్న‌ది రాజ‌కీయ‌వ‌ర్గాల మాట‌. తేరాస సీనియ‌ర్ నేత నాయిని న‌ర్సింహారెడ్డిని కేబినెట్ నుంచి తొల‌గించి గ‌వ‌ర్న‌ర్ గిరీ ఇప్పించాల‌ని అధినేత కేసీఆర్ భావిస్తున్నారు.

ఆ మేర‌కు కేంద్రానికి ప్ర‌తిపాద‌న‌లు పంపించారు. అయితే నాయినికి పోటీగా తెలంగాణ తేదేపా నుంచి మోత్కుప‌ల్లిని గ‌వ‌ర్న‌ర్‌ని చేయాల‌ని చంద్ర‌బాబు త‌ల‌పోస్తున్నారుట‌. ఆ మేర‌కు కేంద్రం చెంత బాబు ప్ర‌స్థావ‌న తెచ్చార‌ని, కాస్తంత సీరియ‌స్‌గానే పైర‌వీలు చేస్తున్నార‌ని చెబుతున్నారు.

అయితే కేంద్రం ఎవ‌రి కోరిక తీరుస్తుందో. తేరాస‌- భాజ‌పా బంధం బ‌ల‌ప‌డాలంటే కేసీఆర్ చెప్పిన నేత‌నే గ‌వ‌ర్న‌ర్‌ని చేయాలి. అలా కాద‌నుకుంటే మోత్కుప‌ల్లినే ఎంక‌రేజ్ చేయాలి. మ‌రి కేంద్రం ఎటువైపు మొగ్గు చూపుతుందో చూడాలి.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -